Wednesday, May 1, 2024

మునుగోడులో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా నిల‌వ‌బోతోంది : మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అన్నారు. మునుగోడులో తన స్వంత ప్రయోజనం కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. మునుగోడుకు రాజ‌గోపాల్ రెడ్డి చేసిందేమీ లేద‌ని, టీఆర్ఎస్ తోనే మునుగోడు అభివృద్ధి సాధ్య‌మ‌న్నారు. రాజగోపాల్ ను ఓడగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజ‌గోపాల్ రెడ్డి రూ.వేల కోట్ల కాంట్రాక్టుల కోస‌మే కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వెళ్లాడ‌న్నారు. బీజేపీ పేద‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అందుకే పోరాటాల్లో ముందున్న క‌మ్యూనిస్టు పార్టీల నేత‌లు త‌మకు మ‌ద్ద‌తుగా ఉన్నార‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ రాజకీయ అనుభవం అంతలేని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఇష్టం వ‌చ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మునుగోడులో నిల్వబోతోందని మంత్రి సత్యవతి రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement