Sunday, May 5, 2024

కిలిమంజారో పై త్రివర్ణ పతాకం.. వివేక్ ను అభినందించిన హనుమకొండ క‌లెక్ట‌ర్‌

హనుమకొండ : ములుగు జిల్లా మంగపేట మండల వాస్తవ్యుడైన గిరిజన యువకుడు వాసం వివేక్ కుమార్ ఆగస్టు 15న ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన శిఖ‌రం (5,895మీ.) కిలిమంజారోను అధిరోహించాడు. శిఖరాగ్రంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటాడు. మంగళవారం సామాజికవేత్త ఈవి శ్రీనివాస్ రావు ఆధ్వ‌ర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుని కలిశారు. అదే విధంగా 2024లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వాసం వివేక్ ను శాలువాతో సత్కరించి అభినందించి నా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement