Wednesday, May 15, 2024

ప్రేమ వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

భీమదేవరపల్లి, ప్రభన్యూస్‌: ప్రేమించు… లేదంటే చావు అని ఓ యువకుడి బెదిరింపులతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉమ్మడి వరంగల్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గట్ల నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన ఎన్‌.శ్వేత (18) అనే యువతిని అదే గ్రామానికి చెందిన వంశీ ప్రేమిస్తున్నానని ప్రతిరోజూ వేధించే వాడు.

అతని బెదిరింపులను భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి చంద్రమౌళి ఆరోపించారు. అతడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement