Monday, May 6, 2024

తమ్ముడి చేతిలో అన్న హతం.. భూ వివాదంతోనే ఇట్లాంటి దారుణం

మహబూబాబాద్‌, ప్రభన్యూస్‌ ప్రతినిథి: భూ తగాదా విషయంతో అన్నను తమ్ముడు కత్తితో నరికి చంపిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా రోటిబండతండాలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే తండాకు చెందిన బూక్య రాంచంద్రుకు బూక్య వెంకన్న, గోవర్ధన్‌, జనార్ధన్‌ ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులకు మూడు భాగాలుగా ఆస్తి పంచగా తండ్రికి సంబంధించిన 4వ వాటా ఆస్థి సుమారు రెండున్నర ఎకరాల భూమి కోసం అన్నదమ్ముల మధ్య వివాదం చోటుచేసుకుంది.

దీంతో తండాలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. తండ్రి ఎవరి దగ్గర ఉంటే వారికి తండ్రి వాటా వస్తుందనే నిర్ణయంతోనే ఈ వివాదం మొదలైంది. ఈ విషయం కోర్టులో కూడా నడుస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి ఆస్తి విషయంలో అన్న భూక్య వెంకన్నతో తమ్ముడు గోవర్ధన్‌ గొడవపడి కత్తితో మెడపై నరకడంతో అన్న వెంకన్న మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో తండాలో విషాదం నెలకొంది. మృతుడు వెంకన్న తమ్ముళ్ళు గోవర్ధన్‌, జనార్ధన్‌లపై కేసు నమోదు చేసి రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ హత్యలో మరో ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల హస్తం కూడా ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వెంకన్న కుటుంబాన్ని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు కొండపల్లి రాంచందర్‌రావు, జంగిలిగొండ ఎంపిటిసి, టీడీపీ రాష్ట్ర మహిళ అధికార ప్రతినిథి కొండపల్లి రాంచంద్రమ్మ, గ్రామపార్టీ అధ్యక్ష, కార్యదర్శులు బానోత్‌ కిషన్‌, అజ్మిర సుమన్‌ పరామర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement