Friday, May 3, 2024

Breaking: విజయనగరం జిల్లాలో పెద్దపులి కలకలం.. స్థానికుల్లో భయం భయం!

విజయనగరం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికుల్లో భయాందోళనను రేకెత్తిస్తోంది. ఎస్​ కోట మండలం ఐతన్నపాలెంటో రెండు ఆవులపై పులి దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఒక ఆవు చనిపోయింది. మరో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. పులి సంచారం విషయం తెలిసి అధికారులు గ్రామీణులను అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు.

అయితే.. మొన్నటిదాకా కాకినాడ సమీపంలో సంచరించిన పులి ఇదే అయి ఉంటుందా.. అక్కడి నుంచి విజయనగరం దాకా వచ్చిందా లేక ఈ పులి వేరేనా అనేది తెలియాల్సి ఉంది. కాకినాడ అటవీ ప్రాంతంలో బోను దాకా వచ్చి బోనులో చిక్కకుండా తప్పించుకున్న పులి జాడ కూడా ఇప్పటికి తెలియలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement