Saturday, May 4, 2024

జాతీయ జెండా విషిష్టతను తెలియజేయాలి : మంత్రి ఎర్రబెల్లి

విద్యార్థులకు స్వాతంత్య్ర సంగ్రామం, జాతీయ జెండా విషిష్టతను తెలియజేయాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద 100 అడుగుల జాతీయ జెండాను మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారీ జాతీయ జెండాను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ సోమేశ్వర్ రావు, ఇతర దాతలు కలిసి కమిటీగా ఏర్పడి జాతీయ సమైక్యత కోసం ఈ బృహత్ కార్యాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement