Tuesday, April 30, 2024

స‌మైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొన్న వ్య‌క్తి హ‌రికృష్ణ

హ‌రికృష్ణ పార్టీ ఆవిర్భావం నుండి ఎన్టీఆర్ చైత‌న్య ర‌థానికి ర‌థ‌సార‌ధిగా ఉంటూ పార్టీకి అనేక సేవ‌లందించార‌ని, స‌మైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొన్న ఏకైక వ్య‌క్తి హ‌రికృష్ణ అని టీడీపీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షులు పి.సాయిబాబా అన్నారు. టీడీపీ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ పోలిట్ బ్యూరో స‌భ్యులు నంద‌మూరి హ‌రికృష్ణ 5వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా జిల్లా కార్యాల‌యంలో సాయిబాబా ఆధ్వ‌ర్యంలో హ‌రికృష్ణ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.

ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… 1996 నుండి 1999 మ‌ధ్య కాలంలో ఎమ్మెల్యేగా ప‌నిచేసిన ఆయ‌న 1996లో ర‌వాణాశాఖ మంత్రిగా సేవ‌లందించార‌న్నారు. 2008లో రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎంపిక‌య్యార‌న్నారు. పోలిట్ బ్యూరో స‌భ్యులుగా చంద్ర‌బాబు నాయుడుకు అత్యంత స‌న్నిహితునిగా ఉంటూ పార్టీకి ఎన్నో సేవ‌లందించార‌న్నారు. మ‌న‌మంద‌రం పార్టీని బ‌లోపేతం చేసిన రోజు ఆయ‌న‌కు నిజ‌మైన ఘ‌న‌మైన నివాళుల‌ని సాయిబాబా అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ న‌ల్లెల్ల కిషోర్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు పి.బాల‌రాజ్ గౌడ్, రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి పెద్దోజు ర‌వీంద్రాచారి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement