Friday, May 3, 2024

సొంతింటి కల సాకారం.. డబుల్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి

ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గత కొద్ది సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల కల ఎట్టకేలకు సాకారం అయింది. జయశంకర్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎంపిక కాబడిన 544 లబ్ధిదారుల సమక్షంలో సోమవారం స్థానిక ఇల్లందు క్లబ్ హౌస్ లో డ్రా, లాటరీ ప్రక్రియ ద్వారా బ్లాక్, ఫ్లోర్ లను స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కేటాయించారు. మిగతా 416 ఇండ్ల నిర్మాణం తుది దశకు చేరుకుందని త్వరలోనే వాటిని కూడా పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి అవకతకాలు జరగకుండా పారదర్శకంగానే ఇండ్ల కేటాయింపు పూర్తి చేయడం జరిగిందని, లబ్ధిదారుల సమక్షంలోనే డ్రా తీస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర, మున్సిపల్ ఛైర్పెర్సన్ వెంకట రాణి సిద్దు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు, లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement