Sunday, May 5, 2024

Accident : రోడ్డు దాటుతుండగా దంప‌తుల‌ను ఢీ కొట్టిన క్రేన్.. భార్య మృతి..

వరంగల్ (ప్రభ న్యూస్) : వరంగల్ లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ ఫోర్ట్ రోడ్డుపై శివనగర్ సాయిబాబా కమాన్ సమీపంలో ఉదయాన్నే ఆటో దిగి రోడ్డు దాటుతున్న భార్యభర్తలను క్రెన్ ఢీ కొనటంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement