Saturday, April 27, 2024

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ : మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలు చేశారు. మన ఊరు మన బడి కరెంట్ సరఫరా, మంచినీరు సరఫరా, వివిధ మరమ్మతులు, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్లు వంటి సదుపాయాల కోసం మొత్తం 40లక్షల 19 వేలతో శంకు స్థాపనలు చేశారు. 80లక్షల నిధుల తో అంతర్గత సిసి రోడ్లు, 10 లక్షల తో వైకుంఠ ధామం, 2.5లక్షలతో డంపింగ్ యార్డ్ పనులకు ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆశాలపల్లి గ్రామానికి 286 ఆసరా పెన్షన్ లు, 720 మందికి రైతు బంధు, 44 మహిళ సంఘాలకు బ్యాంక్ లింకేజి ద్వారా నిధులు, 44 మంది కి వడ్డీ లేని రుణాలు, 24 కేసీఆర్ కిట్ లు, 3 గ్గురు రైతులకు రైతు భీమా అందించినట్లు మంత్రి తెలిపారు. ఈ ఒక్క రోజే కోటికి పైగా నిధులు ఇస్తున్నట్లు, ఇప్పటి వరకు మొత్తం అశాల పల్లి గ్రామానికి 10 కోట్ల నిధులతో పలు అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్ , ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, వరంగల్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి, కలెక్టర్ గోపి, సంగెం మండల ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement