Thursday, May 9, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ… శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. శ్రీ‌వారి ద‌ర్శానికి దాదాపు 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

మొత్తం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 77,154 మంది భక్తులు దర్శించుకోగా, 30182 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.4.62 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement