Wednesday, May 15, 2024

వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఏటూరునాగారం, ప్రభన్యూస్‌: యువకుడి వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలోని ఆకులవారిఘణపురంలో చోటు-చేసుకుంది. ఎసె్స రమేష్‌ కథనం ప్రకారం శుక్రవారం రాత్రి మండలంలోని ఆకులవారిఘణపురానికి చెందిన అరికె పూజిత(15) తన ఇంటి పక్కనే ఉన్న జామ చెట్టు-కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మంగపేట మండలం చుంచుపల్లి వసతి గృహంలో పూజిత 9వ తరగతి చదువుతోంది. ఇదే క్రమంలో ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కుమ్మరి సమ్మయ్య కుమారుడు మణిదీప్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ పూజితను గత కొంత కాలంగా ప్రేమించాలని వేధిస్తున్నాడు.

ఇదే క్రమంలో వీరికి వివాహం చేసుకునే వయస్సు లేదని చెప్పినప్పటికీ వినకుండా చుంచుపల్లి వసతిగృహానికి వెళ్లి తరచూ మణిదీప్‌ వేధింపులను కొసాగిస్తుండడంతో, శుక్రవారం వేధింపుల తాళలేక పూజిత జామ చెట్టు-కు ఉరివేసుకొని మృతి చెందింది. ఈ విషయాన్ని గమనించిన తల్లి పార్వతి స్థానికుల సహాయంతో స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శనివారం తల్లి పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసె్స రమేష్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement