Tuesday, April 30, 2024

పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య

సంగెం : క్షణికావేశంలో చెవ్వ నిఖిత వయస్సు 19 సంవత్సరాలు విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మొండ్రాయి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… బంధువులు, పోలీసులు చెప్పిన కథనం ప్రకారం చెవ్వ రాజకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు పూజిత డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నదని, మృతురాలు రెండవ కూతురు నిఖిత వాగ్దేవి కాలేజీలో ఫార్మసీ ఫస్టియర్ చదువుతూ, హనుమకొండ హాస్టల్లో ఉంటుందన్నారు. మొదటి సెమిస్టర్ పరీక్షలు అయిపోయినందున కొద్దిరోజుల క్రితం ఇంటికి తిరిగి వచ్చిందని, రెండు రోజుల క్రితం మృతురాలు నిఖిత అన్నం తింటుండగా ఇంటిలో మంచినీళ్లు సగం గ్లాసు ఉండగా నీళ్లు తెమ్మని తండ్రిని తొందర పెట్టగా… నీవు అన్నం తిను ఇంతలో మంచినీళ్లు తెస్తానని అనగా మృతురాలు తల్లిదండ్రులను గౌరవం లేకుండా మాట్లాడడంతో గొడవ చేయడానికి హాస్టల్ నుండి ఇంటికి వచ్చావా అని తండ్రి గట్టిగా మందలించాడు. తల్లిదండ్రులను బెదిరించాలనే ఉద్దేశంతో మృతురాలు క్షణికావేశంలో ఇంటి ముందు గల ఇసుకలో ఉన్న మోనోక్రోటోఫాస్ పురుగుల త్రాగి కక్కుకొంటుండగా… వెంటనే బండిపై ఎంజీఎం హాస్పిట్ కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించిందని తెలిపారు. మృతురాలి తండ్రి చెవ్వ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై జైపాల్ రావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement