Friday, April 19, 2024

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు… సెన్సెక్స్ 359, నిఫ్టీ 76 పాయింట్ల నష్టం

దేశీయ స్టాక్ మార్కెట్ల మూడు రోజులు వరుసగా లాభాలతో ముగిసింది. ఈరోజు ఆ లాభాలకు బ్రేక్ పడింది. నిన్న భారీ లాభాలను మూటకట్టుకున్న మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. జర్మనీలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాటు, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 359 పాయింట్లు నష్టపోయి 55,566కి పడిపోయింది. నిఫ్టీ 76 పాయింట్లు కోల్పోయి 16,584 వద్ద స్థిరపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement