Tuesday, May 7, 2024

పరకాల సబ్ జైల్ నుంచి ఖైదీ పరార్

పరకాల సబ్ జైల్ నుంచి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన సంచలనంగా మారింది. ఇటీవల పోక్సో చట్టం నేర ఆరోపణతో ఏటునాగారం చెందిన మహమ్మద్ పాషా పరకాల సబ్ జైలుకు వచ్చాడు. సోమవారం ఉదయం అతను జైలు నుంచి పరారు అయ్యాడు. రోజువారి పనులలో భాగంగా మహమ్మద్ పాషా జైలు ఆవరణలో ఉన్న చెత్తను జైలు బయట పడబోసి వస్తానని చెప్పడంతో జైలు అధికారి అతన్ని బయటకు పంపినట్లు తెలిసింది. ఇదే అదనుగా భావించిన మహమ్మద్ పాషా జైలు నుంచి పరారై తప్పించుకుపోయినట్లు సమాచారం. ఈ విషయమై జైలర్ ప్రభాకర్ రెడ్డిని సంప్రదించగా పరారైన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement