Tuesday, April 30, 2024

డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

ఘట్ కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ లో కోటి రూపాయల నిధులతో ఐదు పడకల బెడ్లతో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డయాలసిస్ పేషెంట్ల‌కు ఇబ్బంది కాకుండా ఘట్ కేసర్ లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, హాస్పిటల్ సూపరిండెంట్, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement