Monday, May 20, 2024

జలకళతో మత్తల్లు దూకుతున్న చెరువులు

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులన్నీ జలకళ ను సంతరించుకున్నాయి.ఉన్న సామర్థ్యానికి మించి నీరు చేరడంతో అలుగులు పడుతున్నాయి.నర్సంపేట కు చేరువలో ఉన్న మాదన్నపేట చెరువు మత్తడి పడుతుండగా గ్రామస్తులు చేపలు పడుతుండగా,పిల్లలు నీటిలో ఆడుతున్నారు.

నర్సంపేట నెక్కొండ ప్రధాన రహదారిలో ఉన్న చెన్నరావుపేట రోడ్ డౌన్ ఉదృతంగా ప్రవహిస్తుండడంతో నెక్కొండ నర్సంపేట మధ్య రాకపోకలు స్తంభించాయి.గురిజాల గ్రామంలో ఉన్న చెరువు మత్తడి పడడంతో ఆ ఊరికి రాకపోకలు స్తంభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement