Sunday, April 28, 2024

గంజాయి నేరస్తుడిపై పిడియాక్ట్

వరుసగా గంజాయిని తరలిస్తూ క్రయ విక్రయాలకు పాల్పడుతున్న నేరస్తుడిపై మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పోలీసులు పిడియాక్ట్ ప్రయోగించారు. శనివారం మరిపెడ సర్కిల్ కార్యాలయంలో సిఐ సాగర్ పిడియాక్ట్ సంభందించిన వివరాలు వెల్లడించారు. మరిపెడ బంగ్లాకు చెందిన బర్మవత్ శ్రీరాములు గత కొన్నేళ్లుగా గంజాయి రవాణా చేస్తూ పలుసార్లు పట్టుబడ్డాడు. జైలుకు వెళ్ళొచ్చిన నేరస్తుడి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవటంతో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు సెక్షన్ 8(c) ఆర్/డబ్ల్యూ 20, ఎండిపిఎస్ యాక్ట్ ప్రకారం పీడీ ఆక్ట్ ప్రయోగించినట్లు తెలిపారు. సమాజానికి హానికలిగించే పని ఎవరు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని, నిషేధిత వ్యాపారాలు అక్రమార్కులు మానుకోవాలని సీఐ సాగర్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement