Wednesday, May 1, 2024

సీసీరోడ్డు పనులు ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలోని పసర గ్రామం పాత నాగారంలో ఐటీడీఏ ద్వారా మంజూరైన రూ.9 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సీతక్కని గ్రామ ప్రజలు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముద్దబోయిన రాము, ఉప సర్పంచ్ బద్దం లింగా రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి రెడ్డి, జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు జక్కు రణ దీప్, దెపాక కృష్ణ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సోదరీమణులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement