Sunday, April 28, 2024

ఎమ్మెల్యే రాజ‌య్య‌ చేతుల మీదుగా కళ్ళ జోళ్ల‌ పంపిణీ

లింగాలఘనపూర్, – తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య త‌న‌ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లో కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో కళ్ళజోడు అవసరమైన వారందరికీ వాసవిక్ ఫౌండేషన్ ప‌హ‌కారంతో పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగేందర్, జిల్లా దిశా కమిటీ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, సొసైటీ చైర్మన్ శ్రీశైలం, మాజీ జెడ్పీటీసీ రంజిత్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గవ్వల మల్లేశం, కో ఆప్షన్ సభ్యులు జానీ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మంగమ్మ యాదగిరి, సర్పంచ్ మనోహర్, మబ్బు కరుణాకర్, సోషల్ మీడియా ఇంచార్జ్ ఉపేందర్, గంగాధర్, శ్రీహరి, వేముల శ్రీనివాస్, ప్రజా ప్రతినిదులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement