Monday, April 29, 2024

ఠాణు నాయక్ కు ఘన నివాళి

కొడకండ్ల , – నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాములకు వ్యతిరేకగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరుడైన జాటోత్ ఠాణు నాయక్ 71వ వర్ధంతి సందర్భంగా తెలగాణ గిరిజన విద్యార్థి సేవా సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో మండలంలోనీ గిర్ని తండా చౌరస్తాలో శనివారం ఠాణు నాయక్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సంద్భంగా రాజేష్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ, సాయుధ పోరాట యోధుడు ఠాణు నాయక్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని, గిరిజన జనాభా ప్రకారం 10శాతం రిజర్వేషన్ కల్పించాలని అలాగే గిరిజన తండా గ్రామ పంచాయతీలను రెవిన్యూ గ్రామ పచాయితీలుగా ఏర్పాటు చెయ్యాలని ఆయన ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన విద్యార్థి సేవా సంఘ్ నాయకులు సునీల్, హారిచందర్, సుధీర్ సిద్దు, సందీప్, వినోద్, హేమని, సురేష్, రాజేష్, స్థానిక నాయకులు బిచ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement