Friday, April 26, 2024

ఇంటింటి ప్ర‌చారంలో మంత్రి స‌త్య‌వ‌తి…

వ‌రంగ‌ల్ – గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహుమానంగా ఇచ్చేందుకు ఓరుగల్లు ఓటర్లు పోలింగ్ కోసం ఎదురుచూస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు… గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు 12వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావేటి కవితకి మద్దతుగా నేడి మంత్రి ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భం గా ఆమె మాట్లాడుతూ, వరంగల్ ను అభివృద్ధి చేస్తున్న తీరును చూసి ముఖ్యమంత్రికి కృతజ్ఞత చెప్పేందుకు వరంగల్ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ నాయకులు వారి ఆధిపత్య చెలాయింపు కోసం మళ్ళీ ప్రజల దగ్గరకు వస్తున్నార‌ని,. ఏనాడు ప్రజల కష్టాల్లో పాలు పంచుకోని అటువంటి నేతలకు బుద్ది చెప్పాల‌ని ఓట‌ర్లకు పిలుపు ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement