Tuesday, May 7, 2024

అర్హులందరికీ వ్యాక్సిన్..

పెద్దపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా 45, ఆపై వయసు కలిగిన వారంతా తప్పనిసరిగా కోవిడ్‌ వ్యాక్సీన్‌ను తీసుకోవాలని పెద్దపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి పిలుపునిచ్చారు. పట్టణంలోని చందపల్లిలో రాగినేడు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోవిడ్‌ వ్యాక్సీనేషన్‌ను ఆయన పరిశీలించారు. భౌతికదూరం పాటించి వ్యాక్సీన్‌ తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ఫణీంద్ర, కౌన్సిలర్లు నెత్తెట్ల స్వరూప కుమార్‌, రాజం మహంత కృష్ణ, సూపర్‌వైజర్లు జగన్నాథం, ఎలిజబెత్‌ రాణి, సిబ్బంది శ్రావణ్‌కుమార్‌, ఆశా వర్కర్లు రజిత, శోభ, లతలు పాల్గొన్నారు. అలాగే మారేడుగొండలో రాఘవాపూర్‌ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వ్యాక్సీనేషన్‌ నిర్వహించారు. ఈకార్యక్రమంలో డాక్టర్‌ మమత, హెచ్‌ఈఓ ఉమామహేశ్వర్‌, సర్పంచ్‌ కన్నం జై తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement