Saturday, May 11, 2024

WGL: కూలీల ట్రాక్ట‌ర్ బోల్తా… ఆరుగురికి గాయాలు

కూలీల ట్రాక్ట‌ర్ బోల్తా ప‌డి ఆరుగురికి గాయాలైన ఘ‌ట‌న ములుగు జిల్లా పాత్ర‌పురం గ్రామ శివారులో చోటుచేసుకుంది. ప్రతి ఏడాది ఈ ప్రాంతంలో పండే ప్రధాన వాణిజ్య పంటైన మిర్చి కోతలకు చత్తీస్ ఘ‌డ్ నుండి ఆదివాసీలు పెద్ద ఎత్తున వస్తారు.

ఈ నేపథ్యంలో కూలీలు కట్టెల కోసం అటవి వెళ్లిన ట్రాక్టర్ పల్టి కొట్టడంతో ఆరుగురు ఛత్తీస్‌ఘ‌డ్‌ కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 108అంబులెన్స్‌లో వెంకటాపురం ప్రధాన వైద్య శాలకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement