Sunday, April 28, 2024

AP: శ్వేత డైరెక్టర్ గా భూమన్

తిరుమల తిరుపతి దేవస్థానాల (టి టి డి ) కు చెందిన శ్రీ వెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణా అకాడమీ ( శ్వేత ) డైరెక్టర్ గా భూమన్ (భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి ) నియమితులయ్యారు. టి టి డి కళాశాల లో సుధీర్ఘ కాలం అధ్యాపకుడుగా పని చేసి పదవీ విరమణ చేసిన భూమన్ రాయలసీమ ఉద్యమ నాయకుడు గా, ఉపన్యాసకులు గా ప్రసిద్ధి చెందారు.

గతంలో శ్వేత డైరెక్టర్ గా పని చేసారు. ఆ సమయంలో ఉద్యోగుల శిక్షణా కార్యక్రమాలతో పాటు తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్ ఏర్పాటు కు, టి టి డి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు కు విశేష కృషి చేశారు. ఆయన సోదరుడు భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి శాసనసభ్యుడు, టిటిడి చైర్మన్ గా ఉన్నారు. ఇటీవలి ధర్మకర్తల మండలి తీర్మానం ప్రకారం భూమన్ ను మరోసారి శ్వేత డైరెక్టర్ గా నియమిస్తూ టిటిడి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement