Sunday, May 5, 2024

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి : గండ్ర సత్య‌నారాయ‌ణ‌రావు

భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఓసీ 2 ప్రభావిత ప్రాంతాలైన శాంతినగర్, హనుమాన్ నగర్ కాలనీ వాసులు న్యాయం చేయాలని మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాసితులు చేస్తున్న ధర్నాలో భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఓసీ 2 లో జరుగుతున్న బాంబు పేలుళ్ల వల్ల కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని, అనేక సార్లు కలెక్టర్, ఆర్డీవో, స్థానిక జీఎం లకు దరఖాస్తులు ఇచ్చినా కాలనీ వాసులకు మాత్రం న్యాయం జరగలేదన్నారు. 2013 భూ సేకరణ చట్టం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కాలనీ తరలించి ఇళ్ల స్థలాలు, నష్టపరిహారం చెల్లించి, స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఓసీ ఉత్పత్తిని నిలిపివేసి కాలనీ వాసులు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని సింగరేణి సంస్థను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభావిత కాలనీ వాసులు అర్బన్ అధ్యక్షుడు దేవన్, జిల్లా నాయకులు అంబాల శ్రీను, రాజు, ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు తోట రంజిత్, మహేందర్, హాఫిజ్, విజయ్, చరణ్, పృథ్వి, ఆంజనేయులు, తిరుపతి, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement