Friday, April 26, 2024

వ్యవసాయ బావిలో దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఉట్ల గ్రామానికి చెందిన బోడ స్వామి (18) బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం బోడ స్వామి గూడూరులోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు . ఇంటర్ లో ఫెయిల్ అయి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈరోజు ఉదయం సప్లమెంటరీ పరీక్ష ఉండగా హాజరై ఇంటికి వచ్చిన అనంతరం తండ్రి మందలించడంతో క్షణికావేశంలో చేను వద్దకు వెళ్లి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement