Sunday, May 5, 2024

Janagama: పాడి రైతులకు ఇన్సెంటివ్ ఇవ్వాలి

జనగామ, జులై 3 (ప్రభ న్యూస్) : పాడి రైతులకు నాలుగు రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వాలని విజయ డైరీ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ సాదం రమేష్ అన్నారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని పాడి రైతులు డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, విజయ డైరీ మేనేజర్ కు వినతిపత్రం అందించారు.

అనంతరం రాష్ట్ర కన్వీనర్ సాధన రమేష్ మాట్లాడుతూ… రైతులకు వ్యవసాయంతో పాడి పరిశ్రమ ద్వారా ఆర్థికంగా మేలు జరుగుతుందన్నారు. జనగామ జిల్లా వ్యాప్తంగా 5000 మంది ఉన్నారని, వీరందరూ విజయ డైరీపై నమ్మకంతో అష్ట కష్టాలు పడి ఆవులు, బర్రెలు మేపుతూ సెంటర్లో పాలు పోస్తే కనీసం ఇప్పటివరకు పాడి రైతులకు ఇన్సెంటివ్ నాలుగు రూపాయలు జమ చేయకపోవడం సరైంది కాదన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement