Monday, April 29, 2024

సింగారం రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ గుడిసెలు.. తొలగించిన ఫారెస్ట్ అధికారులు

మహముత్తరం, (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం సింగారం గ్రామం రిజర్వ్ ఫారెస్ట్ లో సోమవారం అక్రమ గుడిసెలు వెలిశాయి. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది గుడిసెలు వేసిన ప్రాంతానికి వెళ్లి తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులకు ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం జ‌రిగింది.

అయితే ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమంగా గుడిసెలు వేశారని సమాచారంతో సిబ్బందితో వెళ్లి తొలగించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement