Sunday, May 19, 2024

30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ప‌ట్టివేత‌..

వరంగల్ క్రైమ్ : ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నపీడీఎస్ రైస్ వాహనాలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీస దాడి చేశారు. 30 క్వింటాళ్ల‌ రేషన్ రైస్, ఒక లారీ, 2 ఆర్ ఎక్స్, బొలెరో మ్యాక్సీ ట్రక్ ను సీజ్ చేశారు. ముగ్గురు రేషన్ రైస్ స్మగ్లర్లను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అక్రమంగా పిడిఎస్ రైస్ డంప్ ను ఏర్పాటు చేసుకొని అక్రమ నిల్వ చేస్తున్నారు. ఒకే సారి లారీ లోడ్ చేసి, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తూ, అక్రమార్జనకు అలవాటు పడ్డారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ వడ్డే నరేష్ కుమార్, ఎసై లవన్ కుమార్ నేతృత్వంలో దాడి చేసి.. పిడిఎస్ రైస్ స్మగ్లర్ల భరతం పట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement