Saturday, April 27, 2024

పోలీసుల వేధింపులు.. యువకుడు ఆత్మహత్య..

వరంగల్‌ జిల్లాలో పోలీసుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గీసుకొండలో ఎస్సై వేధింపులతో యువకుడు మనస్థాపానికి గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. బంగారం చోరీ కేసులో వంశీ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్సై ఇబ్బంది పెడుతున్నారంటూ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వంశీ మృతి చెందాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement