Sunday, April 28, 2024

WGL: భూపాలపల్లిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు.


ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహరిని, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ట్రైనీ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, జిల్లా జడ్పీ సీఈవో విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి వసంత, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement