Sunday, May 19, 2024

రోడ్డు ప్రమాదంలో జీపీ కార్యదర్శి మృతి

మంగపేట : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగపేట మండలం బిక్షంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న బండ్ల గురుమూర్తి (35) మృతి చెందాడు. ఇందుకు సంబంధించి తోటి పంచాయతీ కార్యదర్శులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంగపేట మండలం నిమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని చింతకుంట గ్రామానికి చెందిన బండ్ల గురుమూర్తి మంగపేట మండలం బిక్షంపేట గ్రామపంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నాడు. గురుమూర్తి భార్య తాడ్వాయి లోని కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం హోలీ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో గురుమూర్తి తాడ్వాయి వెళ్ళాడు. బుధవారం విధులకు హాజరు కావడం కోసం తాడ్వాయి నుండి బిక్షంపేటకు వస్తున్న గురుమూర్తి చిన్న బోయినపల్లి తాడ్వాయి మార్గమధ్యంలో రోడ్డుపై నిలిచి ఉన్న లారీని ఢీకొనడంతో తలకు తీవ్ర గాయం అయింది. గాయపడిన గురుమూర్తిని చికిత్స కోసం వరంగల్ లో హాస్పిటల్ కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురుమూర్తి మరణించాడు. మృతి చెందిన గురుమూర్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement