Tuesday, April 30, 2024

పేద‌ల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే చల్లా

వరంగల్ : తెలంగాణ‌లో పేద‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలం నల్లబెల్లి, బాలునాయక్ తండా గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు పరకాల ఎమ్మెల్యే చల్లా గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్, ఎంపీపీ, జెడ్పిటిసి,సర్పంచులు, ఎంపిటిసిలు, కో ఆప్షన్లు, రైతు బంధు సమీతీ సభ్యులు, మార్కెట్ కమిటీ సభ్యులు, సొసైటీ చైర్మన్లు & కమిటీ సభ్యులు, తహసీల్దార్, ఎంపిడిఓ, తెరాస నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement