Tuesday, April 16, 2024

పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలైన విషాద ఘటన హైదరాబాద్ లోని లింగంపల్లి రైల్ విహార్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బాదం మిల్స్ షేక్‌కు సంబంధించిన గోడౌన్‌ లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement