Wednesday, May 1, 2024

అంతకంతకూ పెరుగుతున్న గోదావరి ఉధృతి

ఏటూరు నాగారం : గంట గంటకు గోదావరి ప్రవాహం పెరుగుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. దయ్యాల వాగు ఉధృతితో మండల కేంద్రంలోని ఓడగూడెం, కాపువాడ, శివాలయం వీధి, ఎస్సీ కాలనీ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ఉధృతితో మండలంలోని పలు మారుమూల గ్రామాలు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ప్రస్తుతం 17.67 మీటర్ల ఎత్తులో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement