Tuesday, April 23, 2024

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్స్ అరెస్ట్-ఎర్ర‌చంద‌నం దుంగ‌లు-కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు

కడప జిల్లా…. గోపవరం మండలంలోని బ్రాహ్మణ పల్లె అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 6 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్.వీరి వద్ద నుంచి 26 ఎర్రచందనం దుంగలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఈమేరకు సమాచారాన్ని వెల్లడించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఎవరైనా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణా కు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.కాగా మీడియా సమావేశంలో మైదుకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్, టాస్క్ఫోర్స్ డీఎస్పీ చెంచు బాబు, బద్వేల్ రూరల్ సిఐ హనుమంతు నాయక్,ఎస్సై చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement