Sunday, May 5, 2024

రైతుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వాలు: గండ్ర

దేశానికే అన్నం పెట్టే వరి రైతుల జీవితాలతో కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఆటలు ఆడుకుంటున్నాయని భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం టిపిసీసీ పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో నియోజకవర్గ ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి పేద ప్రజల మీద విపరీతమైన భారం మోపుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహారిస్తున్న తీరు అసమర్ధత పాలనకు అద్ధం పడుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరికి ఒకరుపై నెపం వేసుకుంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా ధరలను, చార్జీలను పెంచుతున్నాయని మండిపడ్డారు. పెరిగిన ధరలు, చార్జీలను తగ్గించే వరకు కాంగ్రెస్‌ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement