Thursday, April 25, 2024

ప్రతీ కార్య‌క‌ర్త‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటా : ఎమ్మెల్యే చల్లా

వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన తుర్పాటి మనోజ్ కి గత సంవత్సరం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చెయ్యి కోల్పోవడం జరిగింది. బాధితుడికి ప్రభుత్వం ద్వారా మంజూరైన ఎక్స్ గ్రేషియా రూ.2,80,000 చెక్కును మంజూరు చేయించి ఈ రోజు హనుమకొండలోని వారి నివాసంలో అధికారులతో కలిసి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని, విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహనా కల్పించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా గ్రామాలలో విద్యుత్ వినియోగం, కొత్త మీటర్ల కనెక్షన్ల పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి కార్య‌క‌ర్త‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళావతి నరహరి, ఎంపీటీసీ కొనకండి రాణి మొగిలి, కాట్రపల్లి సర్పంచ్ సాగర్ రెడ్డి, డిఈ బిక్షపతి, అధికారులు, ఎడిఈ నరసింహ రావు, సంగేమ్ ఎఈ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement