Sunday, May 12, 2024

ఐనవోలు మల్లిఖార్జున‌స్వామివార్ల సేవ‌లో మంత్రి ఎర్ర‌బెల్లి ….

వ‌రంగ‌ల్ – మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఐన ఓలు మల్లిఖార్జున స్వామి గుడిని సందర్శించి, స్వామి వారిని దర్శించుకున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దర్శనానంతరం ఎర్ర‌బెల్లికి స్వామి వారి శేష వ‌స్త్రాన్ని ఇచ్చి వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనం అందించారు అర్చకులు.. అంత‌కు ముందు ఆల‌యానికి చేరుకున్న మంత్రి ఎర్రబెల్లికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు వేద‌పండితులు, అధికారులు.. ద‌ర్శ‌నానంత‌రం ఎర్ర‌బెల్లి మీడియాతో మాట్లాడుతూ, మహాశివరాత్రి శివ పార్వతుల పెండ్లి రోజని, లింగోద్భవం జరిగిన రోజని చెప్పారు. ఈ రోజు దర్శనం అత్యంత పవిత్రమైనదిగా శివ భక్తులు భావిస్తారని అన్నారు. లయకారుడు శివుడు, శక్తి స్వరూపిణి పార్వతి ల ఆశీర్వచనాల తో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే సీఎం కెసిఆర్ పరిపాలనలో ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. ప్రజల భాగస్వామ్యం తో రాష్ట్రంలో ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు విజయవంతం అవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. సీఎం కెసిఆర్ దేవాలయాల జీర్ణోద్ధరణ, ధూపదీప నైవేద్యాలు, అర్చకులకు జీతభత్యాల పెంపు, అర్చకుల వయో పరిమితి పెంపు, యాదాద్రి, వంటి అనేకానేక చర్యలతో దేవాలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement