Thursday, May 2, 2024

ఘ‌నంగా వేముల‌వాడ‌లో మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు… ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి..

వేముల‌వాడ: ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొన‌సాగుతున్నాయి.. శివ‌నామ స్మ‌ర‌ణ‌తో ఆల‌య‌ప్రాంగనం మారు మోగుతున్నది.. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు రాజ‌న్న‌ను ద‌ర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.. కాగా, మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి దంపతులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంత‌రం కుటుంబ స‌మేతంగా మంత్రి అల్లోల‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. దర్శనానంతరం వేద‌పండితులు ఆశీర్వచనాలను అందించారు. అనంత‌ర మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజ‌ల‌కు మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి దివేనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇది ఇలా ఉంటే పెద్ద సంఖ్య‌లో వ‌చ్చే భ‌క్తుల రాక‌ను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement