Friday, April 26, 2024

వావివరుసలు మరిచి .. చెల్లిపైనే కన్నేసిన కామాంధుడు

దేశంలో మహిళల రక్షణకు ఎన్నో చట్టాలు అమలవుతున్నా సమాజంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. రోజుకో చోట మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా సభ్య సమాజం తలదించుకునేలా.. వావివరసలు లేకుండా చెల్లెలిపై కన్నేసిన కామాంధుడు చంపేస్తానని బెదిరించి ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం ములుగు జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది.
ములుగు జిల్లాలో సొంత చిన్నాన్న కూతురిపైనే ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడు.. వరుసకు చెల్లెలు అవుతుంది.. పట్టుమని 13 సంవత్సరాలు నిండలేదు.. కామవాంఛ తీర్చమని బెదిరింపులకు పాల్పడుతూ గత ఆరు నెలలుగా తన కామ వాంఛ తీర్చుకుంటున్నాడు ఆ కామాంధుడు.. కడుపునొప్పితో బాధపడుతున్న మైనర్ బాలికను తల్లిదండ్రులు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భం దాల్చిందని తెల్ప‌డంతో భయపడుతూ తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిపింది.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు

  • పరారీలో కామాంధుడు
    ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రేవుల గ్రామపంచాయతీ పరిధిలో వాసంపల్లి చంటి (28) అనే యువకుడికి పెళ్లి అయి భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఈ కామాంధుడి కళ్ళు తన సొంత చిన్నాన్న కూతురుపై పడింది. అంతే ఇంకేముంది ఆ దుర్మార్గుడు చెల్లెలు పుష్పాలంకరణ శుభకార్యం నాటి నుండే నువ్వంటే నాకిష్టమని తనను బెదిరించి తన కామవాంఛ తీర్చమని వేధింపులకు పాల్పడ్డాడు కామాంధుడు చంటి. అది తప్పు అన్నయ్య నువ్వు నాకు అన్నయ్య అవుతావు అలా చేయడం తప్పు అని చంటి భార్యకు చెప్పినా కానీ తననే కొట్టి ఎవరికైనా చెప్తే తనను చంపేస్తానని బెదిరించారని ఆ బాలిక తెలిపింది. ఎంత చెప్పినా వినకుండా తనను బెదిరింపులకు గురి చేస్తూ తనను శారీరకంగా హింసిస్తూ, తన తల్లిదండ్రులను చంపేస్తానని, ఇల్లు తగల పెడతానని బెదిరిస్తూ గత ఆరు నెలలుగా తనను శారీరకంగా ఇబ్బంది పెట్టాడని ఆ బాలిక తెలిపింది. తమ ఇల్లు కాలపెడతానని, తనను చంపుతానని, తల్లిదండ్రులను చంపుతానని భయపెట్టి నా కూతురిని లొంగదీసుకున్నాడు. మాకు న్యాయం జరగాలని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
    గత మూడు రోజుల క్రితం ఆ బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులకు తెలపడంతో ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భం దాల్చిందని తేలింది. బాలికను నిలదీసిన తల్లిదండ్రులకు భయపడుతూ విషయం చెప్పేసింది. కుల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసి కామాంధుడికి శిక్షపడేలా చేద్దామని అనుకున్నారు. ఆ కామాంధుడు విషయం తెలుసుకుని పరార్ అవడంతో ఎలాగైనా చట్టపరంగా ఆ కామాంధుడిని శిక్షించాలని అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఫోక్సో చట్టం, 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement