Sunday, May 5, 2024

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి సిపిఐ డిమాండ్

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకి పాల్గొన్న సిపిఐ పార్టీ జిల్లా సమితి సభ్యుడు కుడుదుల వెంకటేష్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని మండిపడ్డారు. నూతన సంస్కరణల పేరుమీద అ ప్రజల నడ్డి విర కొడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement