Tuesday, May 7, 2024

Hyderabad: ఏబీవీపీ కార్య‌క‌ర్త‌ల అరెస్ట్

పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీ రీయింబర్స్‌మెంట్ వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఏబీవీపీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఛలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీ రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించాలని, మెస్ చార్జీలను 15 వందల నుంచి 3 వేలకు పెంచాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 3 వేల కోట్ల ఫీ రీయింబర్స్‌మెంట్స్‌ను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈసంద‌ర్భంగా ఏబీవీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement