Sunday, May 5, 2024

వెంటిలేట‌ర్ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో క‌రోనా రోగి మృతి….

వ‌రంగ‌ల్ ఎంజిఎం హాస్ప‌ట‌ల్లో విషాదం చోటు చేసుకుంది.. కోవిడ్ వార్డులో వెంటిలేట‌ర్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో రోగి మ‌ర‌ణించాడు.. వివ‌రాల‌లోకి వెళితే… నేటి ఉద‌యం ఎం జి ఎం కోవిడ్ వార్డులో విద్యుత్ కు అంత‌రాయం ఏర్ప‌డింది.. దీంతో ఈ వార్డుల‌లోని వెంటిలేట‌ర్ లు ప‌ని చేయ‌లేదు.. ఇదే వార్డులో వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్న క‌రోనా పేషేంట్ గాంధీ మృతి చెందాడు.. వెంటిటేల‌ర్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో ఊపిరి అంద‌క మ‌ర‌ణించిన‌ట్లు చెబుతున్నారు. దీనిపై హాస్ప‌ట‌ల్ సూప‌రింటెండెంట్ స్పందిస్తూ, దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌గా పేర్కొన్నారు.. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించామ‌ని, బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement