Tuesday, May 7, 2024

హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అరెస్ట్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఖానాపురం మండలం దబీర్ పేటకు చెందిన రాకేష్ పోలీస్ కాల్పుల్లో మృతి చెందగా ఈ రోజు అతని అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్తున్న హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డిని పర్వతగిరి మండలం చింత నెక్కొండ లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ బాధ్యులు ఇనాగాల వెంకట్రామిరెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యులు నమిండ్ల శ్రీనివాస్, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పులి అనిల్ కుమార్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, వరంగల్ వెస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు అంబెడ్కర్ రాజు, వరంగల్ వెస్ట్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మొహమ్మద్ ముస్తాక్ నేహల్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వo ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ స్కీo విధానానికి వ్యతిరేకంగా వరంగల్ జిల్లా నర్సంపేట దబిర్ పేట గ్రామానికి చెందిన రాకేష్ మృతి చెందడం జరగింది. రాకేష్ మృతదేహం ఈ రోజు ఉదయం ఎంజీఎం మార్చురీలోని రాకేష్ మృతదేహాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల తో కలిసి సందర్శించి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తెరాస రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement