Sunday, April 28, 2024

Bhupalapalli: బాధిత రైతులకు అండగా సీఎం కేసిఆర్… ఎమ్మెల్యే గండ్ర

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: 2021-22 అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పంటనష్ట పరిహారం చెల్లించాలని నిర్ణయించి బాధిత రైతులకు అండగా నిలిచారని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగెడు వార్డులో మంగళవారం జంగెడు పరిధిలో 274 మంది రైతులకు రూ.6,85,854 ల చెక్కులను రైతులకు అందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ సెగ్గం వెంకట రాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్, స్థానిక కౌన్సిలర్లు దార పులమ్మ, ఆకుదారి మమత, బానోతు రజిత, మంగలంపల్లి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement