Sunday, April 28, 2024

Suspend – ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సస్పెండ్‌

అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ప్రొసీడింగ్స్‌ ఇచ్చింది. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ ఉత్తర్వులు కొనసాగుతాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఆదేశాలు జారీ చేశారు. సూర్యనారాయణ, సహ ఉద్యోగులు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారని అభియోగాలు దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై శాఖ‌ ప‌రంగా ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement