Wednesday, May 15, 2024

కోడికత్తి కేసు.. జగన్‌ పిటిషన్‌ కొట్టివేత

విజయవాడ: కోడి కత్తి కేసులో కుట్ర కోణంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని జగన్‌ తరఫు న్యాయవాది విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేకాకుండా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌ సైతం బెయిల్‌ పిటిషన్‌ వేశారు. ఈ రెండు పిటిషన్లపైన ఆగస్టు 1న విచారణ చేపట్టనున్నట్లు ఎన్‌ఐఏ కోర్టు తెలిపింది.

ప్రస్తుతం నిందితుడు శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారని.. విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో రెగ్యులర్‌ విచారణకు హాజరుకావడం ఇబ్బంది మారిందని అతని తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై న్యాయమూర్తి.. జైలు సూపరింటెండెంట్‌ వివరణ కోరారు. రాజమహేంద్రవరం జైల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎన్‌ఐఏ కేసులో రిమాండ్‌లో ఉన్న ఖైదీకి జైలు నుంచే విచారణ సాధ్యం కాదని కోర్టు దృష్టికి తెచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement