Sunday, May 5, 2024

జయశంకర్ జిల్లా టీజీవో భవన నిర్మాణానికి భూమి పూజ

భూపాలపల్లి (ప్రభ న్యూస్) : శంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా టీజీవో భవన నిర్మాణ పనులకు శుక్రవారం భూమి పూజ చేశారు. మంత్రి, టీజీవో వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు జయశంకర్ జిల్లా కలెక్టర్ 10 గుంటల ప్రభుత్వ స్థలం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భవన్ నిర్మాణం నకు కేటాయించ గా, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి రూ.10 లక్షల నిధులు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రూ.10 లక్షలు వారి నిధుల నుండి సమకూర్చిన నిధులతో భవన నిర్మాణ పనులను ఉమ్మడి వరంగల్ జిల్లా కో-ఆర్డినేటర్ ఎన్నమనేని జగన్ మోహన్ రావు భూమి పూజ చేసి పనులు ప్రారంభించినారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కే.సామ్యూల్, ప్రధాన కార్యదర్శి పెద్ది ఆంజనేయులు, కోశాధికారి ఇక్బాల్, హనుమకొండ జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు సురేష్ కుమార్, రాజేష్ కుమార్, భూపాలపల్లి జిల్లా అసోసియేట్ అధ్యక్షురాలు టి. శైలజ, కార్యవర్గ సభ్యులు అజహర్ షరీఫ్, జగన్మోహన్ రెడ్డి, సునీత, రాజయ్య, అనిల్ కుమార్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కె. సామ్యూల్ మాట్లాడుతూ చైర్మన్, మంత్రి, శ్రీనన్న సహకారంతో, రాష్ట్ర అధ్యక్ష – ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ సహకారంతో భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయుటకు ప్రయత్నిస్తామని జిల్లాలోని గేజిటెడ్ అధికారులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement